రాష్ట్ర ముఖ్యమంత్రి నూతన అధికారిక నివాస గృహప్రవేశం నేడు జరిగింది. ఈ తెల్లవారుజామున 5.22 గంటలకు సీఎం కేసీఆర్ గృహప్రవేశం చేశారు.
ఈ కార్యక్రమానికి చినజీయర్స్వామితో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. గృహ ప్రవేశంలో భాగంగా దైవప్రవేశం, యతి ప్రవేశం, గో ప్రవేశం, నివసించే వారి ప్రవేశంను శాస్ర్తోక్తంగా నిర్వహించారు.
ప్రస్తుత క్యాంపు కార్యాలయానికి సమీపంలోనే నూతన అధికారిక నివాస భవనాన్ని నిర్మించారు. రూ. 38 కోట్ల వ్యయంతో మూడు బ్లాకులుగా ఐదు భవనాల నిర్మాణం జరిగింది.
ఈ భవనాల సముదాయానికి ప్రగతిభవన్గా నామకరణం చేశారు. వీటిలో వివిధ వర్గాలతో భేటీ అయ్యే సమావేశ మందిరానికి జనహిత పేరును పెట్టారు.
దాదాపు వెయ్యి మందితో సమావేశమయ్యేలా మీటింగ్ హాల్ నిర్మాణం జరిగింది. ప్రాంగణమంతా పచ్చదనం వెల్లివిరిసేలా మొక్కలను నాటారు.
https://www.youtube.com/watch?v=2vHurUPOWk0